తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సభలో అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అయితే ఈ సభకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్లో స్పందించారు. ‘ ఈరోజు జరిగిన జరిగిన శాసనసభలో హరీశ్రావు అద్భత ప్రసంగం చేశారు. అవగాహన లేని ముఖ్యమంత్రి, ఆయన మొత్తం క్యాబినేట్పై సింగిల్ హ్యాండ్తోనే సత్తా చూపించారు. కృష్ణా నీళ్లు/ కేఆర్ఎంబీకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ నేతలు చేసిన ఫేక్ ప్రచారాలు, అబద్ధాలను హరీష్ రావు తిప్పికొట్టారు. రేపు జరగబోయే ఛలో నల్గొండ సభకు ఓ ఫర్ఫెక్ట్ టోన్ను చూపించారు. ఈ సభలో కేసీఆర్ తనదైన శైలిలో.. కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలు, అబద్దాలను ఎండగడతారని’ కేటీఆర్ పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Assembly Sessions: సీఎం రేవంత్, మంత్రులను.. హరీష్రావు ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు : కేటీఆర్
ఈరోజు జరిగిన అసెంబ్లీలో మంత్రి హరీష్రావు.. సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినేట్ మంత్రులందరినీ ఒంటిచెత్తో ఎదుర్కొని సత్తా చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్లో తెలిపారు. రేపు జరగబోయే ఛలో నల్గొండ సభకు ఓ ఫర్ఫెక్ట్ టోన్ను చూపించారు.
Translate this News: