BJP Will Cross 370 Seats: లోక్సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా స్థానాల్లో గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే.. ఒక్కో బూత్లో 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూసి.. బీజేపీని 370కి పైగా స్థానాల్లో గెలిపించాలని కార్యకర్తలను, ఓటర్లను కోరారు. ఆదివారం మధ్యప్రదేశ్లో ఆయన పర్యటించారు. అక్కడ రూ.7,550 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఝబువా జిల్లాలో బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని.. ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడికి రాలేదని.. ప్రజా సేవకుడిగా మాత్రమే వచ్చానని తెలిపారు.
పూర్తిగా చదవండి..PM Modi: బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయే చెప్పిన ప్రధాని..
రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా స్థానాల్లో గెలుస్తుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యప్రదేశ్లో పర్యటించిన ఆయన రూ.7,550 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు.
Translate this News: