Haldwani : ఉత్తరాఖండ్(Uttarakhand) లో చెలరేగిన హింసాత్మక ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. తాజాగా నైనిటల్ జిల్లా హల్ద్వాని(Haldwani) లో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదులను కూల్చివేశారు. దీంతో అక్కడి స్థానికులు అల్లర్లకు పాల్పడ్డారు. మదర్సా, మసీదును కూల్చివేసేందుకు వచ్చిన పోలీసు సిబ్బంది, మున్సిపల్ కార్మికులపై రాళ్లు విసిరారు. పలు వాహనాలను, ఏకంగా ఓ పోలీస్ స్టేషన్ను తగలబెట్టేశారు. ఈ ఘటన జరిగిన అనంతరం అధికారులు అక్కడ కర్ఫ్యూని విధించారు. అంతేకాదు అల్లరి మూకలు కనిపిస్తే కాల్చివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే గాయాలపాలైన 100 మందికి పైగా పోలీస్ సిబ్బంది, మున్సిపల్ వర్కర్లని ఆస్పత్రికి తరలించారు.
పూర్తిగా చదవండి..Uttarakhand : ఉత్తరఖాండ్లో అక్రమ మదర్సా, మసీదు కూల్చివేత.. చెలరేగిన అల్లర్లు.. నలుగురు మృతి
ఉత్తరఖాండ్ హల్ద్వానిలో అక్రమంగా నిర్మించిన మదార్సా, మసీదును కూల్చివేయడంతో.. అక్కడి స్థానికులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. వాహనాలకు, పోలీస్ స్టషన్కు నిప్పు పెట్టారు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. వందమందికి పైగా పోలీస్ సిబ్బంది గాయాలపాలయ్యారు.
Translate this News: