Bharat Rice: ప్రస్తుతం ధరలు భారీగా పెరిగాయి. ఇక బియ్యం ధరలకు (Rice Prices) అయితే రెక్కలు వచ్చాయి. దేశమంతటా వరి ఉత్పత్తి భాగానే ఉన్నప్పటికీ..బియ్యం ధరలు మాత్రం దిగడం లేదు. రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్రం భారత్ రైసును (Bharat Rice) అందుబాటులోకి తీసుకువచ్చింది. పేద, సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు భారత్ బ్రాండ్ పేరుతో బియ్యాన్ని తీసుకువచ్చింది. కిలో బియ్యాన్ని రూ. 29 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఈ బియ్యం విక్రయాలను ఇప్పటికే ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..Bharat Rice: నగరవాసులకు గుడ్ న్యూస్ …29 రూపాయల బియ్యం అమ్మేది ఈ ప్రాంతాల్లోనే..!!
నాణ్యమైన సన్నబియ్యం రూ. 29కే. కేంద్రం తీసుకొచ్చిన ఈ భారత్ రైస్ గురించే దేశమంతా మాట్లాడుకుంటోంది. హైదరాబాద్ లో కోఠిలో కేంద్రీయ భండార్, గన్పార్క్ సమీపంలో NAAFED, సుల్తాన్ బజార్లో NCCF ఉంది. ఈ కేంద్రాల్లో భారత్ రైస్ను విక్రయిస్తారు.
Translate this News: