Telangana Lok Sabha Candidates List: తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై పీఈసీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన లోక్సభ ఎన్నికల సీట్లకు వచ్చిన 309 దరఖాస్తుల్లో ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చ సాగింది. 309 మందికి సంబంధించిన జాబితాను ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులకు అందజేశారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా మహబూబాబాద్ (Mahabubabad) ఎంపీ స్థానానికి 48 దరఖాస్తులు, అత్యల్పంగా మహబూబ్ నగర్ (Mahabubnagar) ఎంపీ స్థానానికి 4 దరఖాస్తులు వచ్చాయి. దీంట్లో ఒక్కో నియోజక వర్గానికి మూడు లేదా నాలుగు అభ్యర్ధులను పేర్లను సూచించాలని పీఈసీ నిర్ణయించుకుంది.
పూర్తిగా చదవండి..Telangana: లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు..
పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్ధుల మీద కసరత్తులు చేస్తోంది. కొంతమంది ఎంపీల షార్ట్ లిస్ట్ని రెడీ చేసింది. దాంతో పాటూ అశావహుల నుంచి అప్లికేషన్లను స్వీకరించింది.
Translate this News: