Assembly Sessions Secon Day:ఏపీలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. చివరగా సీఎం జగన్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. ధన్యవాద తీర్మానాన్ని టీజేఆర్ సుధాకర్ ప్రవేశపెట్టారు. అయితే టీడీపీ పెట్రోల్, డీజిల్ ధరలపై వాయిదా తీర్మానాన్ని అడిగింది. దీన్ని స్పీకర్ తోసిపుచ్చారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు ఇచ్చిన రాజీనామాకు ఆమోదం తెలిపారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh:గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం..రెండు బిల్లుల ఆమోదం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం ప్రవేశపెడుతున్నారు. తర్వాత తీర్మానం పై అసెంబ్లీలో చర్చ జరుగనుంది.
Translate this News: