Kavitha Letter to Batti: ఎన్నికల వేళ బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి పెట్టబోయే బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 20వేల కోట్ల రూపాయిలు కేటాయించాలని ఈ లేఖలో కోరారు. బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలయ్యేలా చర్యలు చేపట్టాలని కవిత విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్న విషయాన్ని కవిత ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీసీ సంక్షేమానికి రానున్న అయిదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిప్యూటీ సీఎంకు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ హామీ ఇచ్చిందని తెలిపారు.
పూర్తిగా చదవండి..Kavitha: భట్టి అన్నా.. ఈ పనులు చేయి.. కవిత లేఖాస్త్రం!
2024-25బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయించాలని మంత్రి భట్టికి కవిత లేఖ రాశారు. బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రూ.50 కోట్ల వ్యయంతో ప్రొ:జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు.
Translate this News: