V. Hanumantha Rao: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 16 స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయింపు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య భట్టి నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు. తాజాగా ఈ రేసులోకి కొత్త వ్యక్తి వచ్చారు. అదెవరో కాదు మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు. ఖమ్మం పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కొరకు గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఎంపీ టికెట్ ఇస్తుందనేది మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Hanumantha Rao: ఖమ్మం ఎంపీ టికెట్.. కోటి ఆశలతో హనుమంతరావు!
మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్. నేతల నుంచి దరఖాస్తులు తీసుకుంటుంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఖమ్మం ఎంపీ టికెట్ కొరకు గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్నారు.
Translate this News: