MLA Malla Reddy : బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ని కలవబోతున్నట్లు మల్లారెడ్డి ప్రకటన చేశారు. గతంలో ఇద్దరం టీడీపీ(TDP) లోనే ఉన్నామని పేర్కొన్నారు. డెవలప్మెంట్ కోసం సీఎంను కలిస్తే తప్పేముంది అని ప్రశ్నించారు. ఇదే విషయంపై త్వరలోనే సీఎం రేవంత్రెడ్డిని కలవనున్నట్లు తెలిపారు. చర్చకు తావులేకుండా కలిసే ముందు సమాచారం ఇస్తానని అన్నారు. మేము ఓడిపోతామని, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. తాము ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని అన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా తననే బీఆర్ఎస్ అధిష్టానం పోటీ చేయమందని అన్నారు. తన కొడుకు భద్రారెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని కేసీఆర్ ను అడుగుతున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Malla Reddy : త్వరలోనే సీఎం రేవంత్ని కలుస్తా.. మల్లారెడ్డి కీలక ప్రకటన.. కాంగ్రెస్లోకి జంప్?
మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని అనుకోలేదని.. ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదని అన్నారు. త్వరలో సీఎం రేవంత్ ను కలుస్తానని.. గతంలో ఇద్దరం టీడీపీలోనే ఉన్నామని పేర్కొన్నారు. దీంతో మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే చర్చ జోరందుకుంది.
Translate this News: