Jharkhand Politics:జార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత అక్కడి ప్రభుత్ం పడిపోతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. చంపై సోరెన్నె సీఎంగా ప్రకటించిన తర్వాత తమ సొంత పార్టీలోనే నిరసన స్వరాలు వినిపిస్తుండడంతో ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్ళిపోకుండా ఉండడానికి జార్ఖండ్ ముక్తి మోర్చా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ పార్టీకి చెందిన 35 మంది ఎమ్మెల్యేలను రాంచీ నుంచి ప్రత్యేక ఛార్టర్డ్ విమానంలో హైదరాబాద్ లేదా బెంగళూరు తరలించేందు ప్లాన్ చేసింది. ఈరోజు రాజ్భవన్ నుంచి ఆహ్వానం రాకుంటే ఈ ఎమ్మెల్యేలను తరలించనున్నారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Jharkhand Politics:జార్ఖండ్లో ప్రభుత్వం పడిపోతుందా? ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలిస్తున్న జేఎంఎం
జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం ఎదురవనుందా అంటే అవుననే అంటున్నారు. సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత అక్కడ రాజకీయ కల్లోలం ఏర్పడింది. దీంతో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలిస్తోంది.
Translate this News: