Budget : 2024-25 సంవత్సరానికి గానూ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం ముగిసింది. దాదాపు గంటపాటూ ఆమె ప్రసంగం సాగింది. మధ్యంతర బడ్జెట్(Interim Budget) లో ఆదాయపన్ను వర్గాలకు ఈసారి ఏమీ ఊరట లభించలేదు. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టామని అయితే చెప్పారు కానీ మార్పులు ఏమీ కనిపించలేదు. కొత్త పన్ను విధానంతో రూ. 7లక్షల వరకు పన్ను లేదని చెప్పారు. దీన్ని 8 లక్షల వరకు పెంచుతారని బావించారు కానీ దానికి సంబంధించిన ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఇక ఉద్యోగుల కోసం మాత్రం స్టాండర్డ్ డిడెక్షన్ రూ.50వేల నుంచి 75వేలకు పెంచారు. ఇక ప్రత్యక్ష పన్నులు అయితే మూడు రెట్లు పెరిగాయి. ఇక మరోవైపు కార్పొరేట్ ట్యాక్స్(Corporate Tax) ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఏడాది రూ.26.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం అంచనాగా ఉందని… అందుకే ఫిజికల్ డెఫిసిటీ 5.2 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపారు. ఇక 2023-24 ఏడాదికి రెవెన్యూ ఆదాయం(Revenue Income) రూ.30.08 లక్షల కోట్లు వచ్చిందని తెలిపారు నిర్మలా సీతారామన్. అలాగే ఈ ఏడాది ద్రవ్యలోటు 5.8 శాతం ఉందని..ఈ ఏడాది అప్పులు రూ.14లక్షల కోట్లు ఉన్నాయని వివరించారు.
పూర్తిగా చదవండి..Budget 2024-25 : వేతన జీవులకు లభించని ఊరట..యథాతథంగా ట్యాక్స్ విధానం.
మధ్యంతర బడ్జెట్లో ఆదాయపన్ను వర్గాలకు ఈసారి ఏమీ ఊరట లభించలేదు. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టామని అయితే చెప్పారు కానీ మార్పులు ఏమీ కనిపించలేదు. కొత్త పన్ను విధానంతో రూ. 7లక్షల వరకు పన్ను లేదని తెలిపారు.
Translate this News: