GADDAR JAYANTHI TODAY : ఉద్యమకారుడిగా, మహా విప్లవ కవిగా తన జీవితాన్ని బడుగు బలహీనవర్గాల కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్(Gaddar). తుది శ్వాశ వరకు అణగారిన వర్గాల కోసమే పాటుపడి, తన పాట(Song) తో జనం గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయిన ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ జూపల్లి కృష్ణారావు తెలిపారు. సీయం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసిందని, నేడు (బుధవారం) రవీంద్ర భారతీ(Ravindra Bharathi)లో గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమాజంలో ఉన్న అంతరాలు తొలగించాలని తన జీవితాంతం పరితపించి, తన గళంతో జనాలలో చైతన్య స్ఫూర్తిని రగిలించారని ఈ సందర్భంగా గద్దర్ సేవలను గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..GADDAR JAYANTHI : అధికారికంగా ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలు
ప్రజా యుద్దనౌక గద్దర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది..ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసారు.జనవరి 31న ఈ వేడుకలు రవీంద్రభారతిలో నిర్వహిస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
Translate this News: