నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద అద్దంకి-నార్కట్పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో వచ్చిన గుర్తుతెలియని లారీ.. అదుపుతప్పి బొల్తాపడిన కారును వెనకనుంచి ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాల్లో అయిదుగురు మృతి చెందారు. మృతులు మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. చెరుపల్లి మహేశ్, ఆయన భార్య జ్యోతి, కుమార్తె రిషిత, మహేశ్ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్, ఆయన కుమారుడు లియాన్సీ అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలిపారు.
పూర్తిగా చదవండి..Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు దుర్మరణం..
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అద్దంకి-నార్కట్పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి వేగంగా వస్తున్న లారీ వెనకనుంచి ఓ కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
Translate this News: