TET: ఏపీలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ (Tet Notification)జారీ చేశారు. అప్పుడు 4.50లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ దాదాపు 2లక్షల మంది మాత్రమే అర్హత సాధించారు. ఈసారి సుమారు 5లక్షల మంది టెట్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ. ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.
పూర్తిగా చదవండి..TET: బీఈడీ, డీఈడీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్..రెండ్రోజుల్లో టెట్ నోటిఫికేషన్..!!
ఏపీలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. టెట్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. 2022,2023లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి డీఎస్సీలో అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో టెట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Translate this News: