Bihar CM Nitish Kumar: బీహార్ లో రాజకీయ సంక్షోభం కొలిక్కి వచ్చింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా? లేదా ఇండియా కూటమిలో కొనసాగుతారా అనే చర్చకు తెర పడింది. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి గుడ్ బై చెప్పారు నితీష్ కుమార్. బీజేపీతో తిరిగి స్నేహం చేసేందుకు సై అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు జేడీఎల్పీ సమావేశం జరగనుంది. ఆ సమావేశం పూర్తి అయిన తరువాత గవర్నర్ ను కలిసి తన సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..BREAKING: రేపు సా.4గంటలకు బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం
ఇండియా కూటమికి గుడ్ బై చెప్పారు నితీష్ కుమార్. బీహార్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. రేపు సా.4 గంటలకు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ మళ్లీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి 2 డిప్యూటీ సీఎం, స్పీకర్ పోస్టులు ఇవ్వనున్నారు.
Translate this News: