JC Diwakar Reddy: మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇటీవల అధికార పార్టీ వైసీపీ గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త ఇంఛార్జిల నియామకం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు లిస్టులని ప్రకటించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఐదో లిస్టుపై కసరత్తు చేస్తోంది. టీడీపీ అధినేత ఇద్దరు అభ్యర్థులను ప్రకటించగా .. జనసేన కూడా ఇద్దరిని ప్రకటించింది.
పూర్తిగా చదవండి..JC Diwakar: టికెట్ చిచ్చు.. జేసీ దివాకర్రెడ్డికి చంద్రబాబు షాక్?
టీడీపీ నుంచి అనంతపురం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్. ఈ క్రమంలో చంద్రబాబును కలవగా టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే జేసీ దివాకర్ పార్టీకి రాజీనామా చేస్తారనే చర్చ జరుగుతోంది.
Translate this News: