Rythu Bandhu: రైతు బంధు డబ్బుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) షాక్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా జనవరి నెలాఖరులోపు రైతు బంధు వేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పగా.. తాజాగా రైతు బంధు జమపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతు ఖాతలో రైతు బంధు డబ్బును జమ చేస్తామని అన్నారు. వచ్చే సీజన్ నుంచి రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని అన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. తమ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ లాగా హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఉండదని అన్నారు.
పూర్తిగా చదవండి..Rythu Bandhu: రైతు బంధు ఇప్పట్లో లేనట్లే.. రేవంత్ షాకింగ్ ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ షాక్ ఇచ్చారు. ఇటీవల రైతు బంధు నిధులను ఈ నెలలోనే రైతుల ఖాతాలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు నిధులు FEB నెలాఖరుకు జమ చేయనున్నట్లు తెలిపారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: