Viral Video : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. రామాలయంలో రాంలల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్టను వైభవంగా నిర్వహించారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన మరునాడే వాస్తవాధీనరేఖ వద్ద భారత ఆర్మీ జవాన్లతో కలిసి చైనా సైనికులు(Chinese soldiers) జై శ్రీరామ్(jai sriram) అంటూ నినాదాలు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో గురించి తేదీ మాత్రం ఖచ్చితంగాతెలియరాలేదు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సిబ్బందికి జై శ్రీరామ్ నినాదాలు చేయడంలో భారతీయ సైనికులు సహాయం చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. రెండువైపులా టేబుల్స్ వేసుకుని ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Viral Video : బాలరాముడు అందరికీ దేవుడే.. జై శ్రీరామ్ అంటూ చైనా సైనికులు నినాదాలు..!!
దేవుడు ముందు అందరూ తలవంచాల్సిందే. పొరుగు దేశం చైనా కూడా జైశ్రీరాం అంటూ నినాదాలు చేసింది. రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన మరునాడే చైనా జవాన్లు సరిహద్దుల్లో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
Translate this News: