INDIA VS ENGLAND 1st Test Hyderabad: ఈ నెల 25 నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సిరీస్ మొదలుకానుంది. తొలి టెస్టు హైదరాబాద్లోనే జరగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్తో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తలపడనుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్తో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుండగా.. తరువాత నాలుగు రెడ్ బాల్ పోటీలు విశాఖపట్నం, రాజ్కోట్, రాంచీ, ధర్మశాలలో జరుగుతాయి. ఇక ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తగిన ఏర్పాట్లు చేసింది.
పూర్తిగా చదవండి..IND VS ENG: హైదరాబాద్ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఫ్రీగా ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ చూసే ఛాన్స్!
ఈ నెల(25-29) హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ సారి మ్యాచ్ చూపిస్తున్నామని HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు చెప్పారు. విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నామని తెలిపారు.
Translate this News: