Mahalakshmi Scheme: తెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) కార్యాచరణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండో రోజే ఆరు గ్యారెంటిలో రెండు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Scheme), ఆరోగ్య శ్రీ కార్డు (Arogya Sree) పరిమితి రూ. 15 లక్షలకు పెంచింది. తాజాగా మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Mahalakshmi Scheme: గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి మహిళలకు రూ.2500!
రేవంత్ సర్కార్ త్వరలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పథకాన్ని ఎంపీ ఎన్నికలకు ముందే అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.
Translate this News: