US strikes on Yemen: ఎర్రసముద్రంలో వార్ కొనసాగుతోంది. హౌతీ రెబెల్స్ మీద అమెరికా దాడులు చేస్తూనే ఉంది. ఇవి రోజు రోజుకూ మరింత పెరుగుతున్నాయి కూడా. శనివారం హౌతీల (Houthis) కేంద్రం మీద అమెరికా మరోసారి క్షిపణులతో దాడి చేసింది. రాజధానిలో సనాలో భారీ పేలుడు వినిపించిందని పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఎర్రసముద్రం (Red Sea), గల్ఫ్ ౠఫ్ ఎడెన్లో యెమెన్ తీర ప్రాంతాల వైపు రావొద్దని అమెరికా జెండాలతో ఉన్న వాణిజ్య నౌకలను యూఎస్ నేవీ హెచ్చరించింది. మరో 72 గంటల పాటూ ఆ దారిలో వెళ్ళొద్దని చెప్పింది. అలా చేసిన కొద్దిసేపటికే యెమెన్ కేంద్రం మీద క్షిపణి దాడి జరిగింది.
పూర్తిగా చదవండి..USA-Yemen: హౌతీలపై అమెరికా దాడులు మరింత తీవ్రతరం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకల మీద డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్న హౌతీ రెబెల్స్ మీద అమెరికా ప్రతి దాడులు చేస్తోంది. ఈరోజు అమెరికా మరోసారి భారీ దాడులకు పాల్పడింది.
Translate this News: