Naa Saami Ranga: అక్కినేని నాగార్జున – విజయ్ బిన్నీ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ చిత్రం నా సామిరంగ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ ఫీమేల్ లీడ్ గా నటించారు. అల్లరి నరేష్ (Allari Naresh), యంగ్ హీరో రాజ్ తరుణ్ నాగార్జునతో (Akkineni Nagarjuna) పాటు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి (M. M. Keeravani) ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన నా సామిరంగ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత నాగార్జున పక్కా పల్లెటూరి గెటప్ లో మాస్ అవతార్ లో కనిపించారు. ట్రైలర్ లో చూపించిన మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తో నాగార్జున క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు అర్థమైంది. నాగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇక తాజాగా ఈ రోజు నా సామిరంగ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇది ఇలా ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక అభిమాని చేసిన పనికి నాగార్జున షాక్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Naa Saami Ranga: వీరాభిమాని చేసిన పనికి నాగ్ షాక్.. ఏం చేశాడో చూడండి!
నాగార్జున లేటెస్ట్ చిత్రం 'నా సామిరంగ' జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో ఒక వీరాభిమాని చేసిన పనికి నాగార్జున షాకయ్యారు. హీరో పాదాలను తాకేందుకు జనంలో నుంచి దూసుకొచ్చాడు.
Translate this News: