రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అవిశ్వాస రాజకీయాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల క్రితమే నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టడంతో బీఆర్ఎస్ (BRS) నుంచి ఎన్నికైన ఛైర్మన్ పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ ఛైర్మన్ గా ఎన్నిక కానున్నారు. సూర్యాపేటలోను నిన్న అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కలెక్టర్ కు కౌన్సిలర్లు నోటీసు అందించారు. తాజాగా వరంగల్ మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కార్పోరేటర్లు కాంగ్రెస్లో చేరారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రేవంత్ రెడ్డిని కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్
TS Politics: వరంగల్ మేయర్ పై అవిశ్వాసం.. కొండా సురేఖ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
వరంగల్ మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కౌన్సిలర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే.. ఈ గండం నుంచి గట్టెక్కడానికి కాంగ్రెస్ లో చేరాలని సుధారాణి భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. మంత్రి కొండా సురేఖ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తిగా మారింది.
Translate this News: