MLC By-Elections:తెలంగాణ శాసనమండలి ఉపఎన్నికల్లో వేర్వేరు బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహిస్తామని చెబుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విధానం కొత్తేమీ కాదని…ఎప్పటినుంచో అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది. కొన్నేళ్లుగా శాసనమండళ్లు ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని చెబుతోంది. సాధారణంగా మండలి ఎన్నికల్లో ఒకే బ్యాలెట్ పత్రంలో అభ్యర్థులను నమోదు చేస్తారు. తరువాత వచ్చే ఓట్ల ఆధారంగా గెలుపు ఎవరిదో ప్రకటిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్యేల కోటాలోనివి. ఈసారి రెండు ఉపఎన్నికలకు రెండు బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నారు. అంటే ఒక్కో ఎమ్మెల్యే తమ ప్రాథమ్యాలను రెండు బ్యాలెట్లలో నమోదు చేయాల్సి ఉంటుంది.
పూర్తిగా చదవండి..Telangana:ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్.. BRS కు షాక్.. రెండూ కాంగ్రెస్ ఖాతాలోకే!
తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేసింది. ఈరోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు రిజల్ట్ కూడా ప్రకటించనున్నారు.
Translate this News: