Nalgonda : ఉమ్మడి నల్గొండ(Nalgonda) ఎంపీ సీటు కోసం అధికార కాంగ్రెస్ పార్టీతో(Congress Party) పాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీలో(BRS Party) తీవ్ర పోటీ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లోని సూర్యాపేట మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. దీంతో ఈ ఎన్నికల్లో ఇక్కడ తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ నాయకత్వం ధీమాతో ఉంది. ఈ టికెట్ ను తన కుమారుడు రఘువీర్ కు ఇప్పించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి(Jana Reddy) విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే.. సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి(Patel Ramesh Reddy) కూడా అంతే సీరియస్ గా ట్రై చేస్తున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ను ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీగా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చింది.
TS Congress : నల్గొండ కాంగ్రెస్ టికెట్ రేసులో ఊహించని పేరు.. పటేల్ రమేష్ రెడ్డికి మళ్లీ షాక్?
సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీగా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పడు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
Translate this News: