సంక్రాంతి పండుగ అంటే ఆ సందడి మాములుగా ఉండదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేడుకను మూడురోజుల పాటు ప్రజలు సంతోషంగా గడుపుతారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే జోరుగా కోళ్ల పందెలు జరుగుతుంటాయి. అందుకే పట్టణాలు, నగరాల్లో నివసించే వారు సంక్రాతికి తమ సొంతూర్లకు పయనమవుతుంటారు. దీంతో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో 6 రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్, కాకినాడ, తిరుపతి నగరాల మధ్య జనవరి 10 నుంచి 15 తేదీల్లో సర్వీసులు అందించనుంది.
పూర్తిగా చదవండి..Sankranthi Fest: సంక్రాంతి పండక్కి మరో 6 ప్రత్యేక రైళ్లు.. రూట్ల వివరాలు ఇవే..
సంక్రాతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, కాకినాడ, తిరుపతి నగరాల్లో ఈ రైళ్ల సర్వీసులు అందించనుంది.
Translate this News: