Hyderabad JNTU : ప్రస్తుతం మనిషి సగటు ఆయుఃప్రమాణం 70 ఏళ్లు. అయితే, ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. 100 ఏళ్ళు పైబడి జీవించి రికార్డులకు ఎక్కిన వారూ ఉన్నారు. ప్పపంచం చాలా మారిపోయింది. వైద్యరంగం విపరీతంగా అభివృద్ధి చెందిపోయింది. పెద్ద పెద్ద రోగాలు సైతం ప్రస్తుత వైద్యం ముందు తలవంచేస్తున్నాయి.దీంతో మనిషి ఆయుఃప్రమాణం పెరిగిపోయింది. ఇది భవిష్యత్తులో మరింత పెరుగుతుంది అంటున్ని ఇస్రో(ISRO) ఛైర్మన్ ఎస్. సోమనాథ్(Somanath). శరీరంలో పాడైపోయిన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా 200 నుంచి 300 సంవత్సరాలు జీవించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
పూర్తిగా చదవండి..ISRO Chairman Somanath : 300ఏళ్ళు బతికే రోజు దగ్గరల్లోనే ఉంది..ఇస్రో ఛైర్మన్
హైదరాబాద్ జేఎన్టీయూ 12వ స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్ గా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి 200-300 ఏళ్లు బతికే రోజులు రానున్న రోజుల్లో వస్తాయని చెప్పారు. చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా ఇది సాధ్యం అవుతుందన్నారు.
Translate this News: