న్యూఇయర్ వేడుకలు ముగియడంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) దుబాయ్ నుంచి స్వదేశానికి చేరుకున్నాడు. వచ్చిరాగానే ధోనీ కోర్టును ఆశ్రయించాడు. క్రికెట్ అకాడమీ(Cricket Academy) పేరుతో తనను మోసం చేసి రూ. 15కోట్లు కాజేసిన ఇద్దరిపై రాంచీ కోర్టు(Ranchi court)లో కేసు పెట్టాడు. ధోనీ ఫిర్యాదుతో అర్కాస్పోర్ట్స్ ((Aarka Sports) ) యజమాని మిహిర్ దివాకర్, సౌమ్యా విశ్వాస్ (Soumya Vishwas)) లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు మిహిర్ దివాకర్ ((Mihir Diwakar)) 2017లో ధోనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నా పేరు మీద అనేక చోట్ల క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసిన తర్వాత కంపెనీ లాభాల భాగస్వామ్య ఒప్పందాన్ని పాటించలేదు. దీని వల్ల తనకు రూ.15 కోట్ల నష్టం వాటిల్లిందని ధోనీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పూర్తిగా చదవండి..MS Dhoni: క్రికెట్ అకాడమీ పేరుతో ధోనీకి టోకరా…15కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..ఇద్దరిపై కేసు..!!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మాజీ వ్యాపార భాగస్వాములు రూ.15 కోట్ల మేర మోసం చేశారంటూ శుక్రవారం కోర్టును ఆశ్రయించాడు.ధోని ఫిర్యాదుతో అర్కాస్పోర్ట్స్ యజమాని మిహిర్ దివాకర్, సౌమ్యా విశ్వాస్ లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Translate this News: