Gautham Adani : అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(Gautham Adani) కి బుధవారం సంతోషకరమైన రోజునే చెప్పాలి. హిండెన్బర్గ్ రీసెర్చ్(Hindenburg Research) కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) నుంచి ఉపశమనం లభించిన వెంటనే అదానీ గ్రూప్ షేర్లు(Adani Group Shares) రాకెట్గా మారాయి. గ్రూప్ షేర్లు దాదాపు 12 శాతం పెరిగాయి. గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.15 లక్షల కోట్లు దాటింది. షేర్ల పెరుగుదల కారణంగా, అదానీ నికర విలువ కూడా 4.01 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 3,34,06,70,85,000 పెరిగి 89.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో సంపన్నుల జాబితాలో ఒక స్థానం ఎగబాకి 14వ స్థానానికి చేరుకున్నాడు. ఈ సంవత్సరం అతని నికర విలువ $5.64 బిలియన్ల రికార్డు పెరుగుదలను చూసింది. అయితే గతేడాది అతను అత్యధిక నికర విలువను కోల్పోయిన వ్యక్తిగా నిలిచారు. అయితే కొత్తఏడాది వచ్చే సరికి అదానీ అదృష్టం మారిపోయింది. గత రెండు రోజుల్లో అతని నికర విలువ అత్యంత పెరిగింది.
పూర్తిగా చదవండి..Adani : సుప్రీం రిలీఫ్ ఇవ్వగానే… అదానీకి లక్ష్మీ కటాక్షం..షేర్ మార్కెట్లో రికార్డ్ ర్యాలీ..!!
హిండెన్బర్గ్ రీసెర్చ్ కేసులో అదానీకి సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. దీంతో గ్రూప్ షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో 14వ స్థానానికి చేరుకున్నాడు.
Translate this News: