దక్షిణ కొరియా ( South Korean) ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్ (Lee Jae-myung)గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి (Attack with a knife) చేశారు. గడియోక్ ద్వీపంలో కొత్త ఎయిర్ బేస్ను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతుండగా ఈ దాడి జరిగింది. నగరంలోని కొత్త విమానాశ్రయం నిర్మాణ స్థలాన్ని సందర్శించేందుకు వచ్చిన లీపై దాడి జరిగిందని బుసాన్ అత్యవసర అధికారులు తెలిపారు.లీ స్పృహలో ఉన్నారని, అయితే అతని పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. దీని గురించి ఇంకా సమాచారం లేదు. లీ మెడను గాయపరిచేందుకు ఆ వ్యక్తి కత్తిలాంటి ఆయుధాన్ని ఉపయోగించాడని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. లీ 2022 అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ యున్ సుక్ యోల్(Eun Suk Yeol)చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు.
పూర్తిగా చదవండి..South Korean: మీడియాతో మాట్లాడుతున్న దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై కత్తితో దాడి..వీడియో వైరల్..!!
దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్ గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. గడియోక్ ద్వీపంలో కొత్త ఎయిర్ బేస్ను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతుండగా ఈ దాడి జరిగింది. 2022 అధ్యక్ష ఎన్నికల్లో యూన్ సుక్ యోల్ చేతిలో లీ ఓడిపోయారు.
Translate this News: