మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డంపర్, బస్సు ఢీకొనడంతో బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మంటల్లో 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో ఉన్న వ్యక్తుల ప్రకారం బస్సులో నుంచి 11 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎస్సీ విజయ్ ఖత్రీ కూడా ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే మరింత పెరిగే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..Madhyapradesh: ఘోర ప్రమాదం…ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం…12మంది సజీవ దహనం..!!
మధ్యప్రదేశ్లోని గుణలో పెను విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
Translate this News: