ఆధార్ కార్డు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఆధార్ కూడా ఒకటి. ఆధార్ కార్డు లేనిది ఎలాంటి పనులు చేయలేము. ముఖ్యంగా రేషన్ కార్డు దగ్గరి నుంచి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించే వరకు చాలా వాటికి ఆధార్ కార్డు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే. అందుకే ఆధార్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్ గా పేర్కొంటున్నరాు. అయితే 18ఏళ్లు నిండినా ఇప్పటివరకు ఆధార్ కార్డు లేనివారు చాలా మందే ఉన్నారని అంచనా. అయితే 18ఏళ్లు నిండిన యువతీయువకులు కొత్త ఆధార్ కార్డు తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఆధార్ కార్డుల జారీపై యూఐడీఏఐ కొత్త నిబంధన పెట్టింది. కొత్తగా ఆధార్ తీసుకునేవారికి మల్టిలెవెల్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. పాస్ పోర్టు వెరిఫికేషన్ తరహా వ్యవస్థను రెడీ చేసింది.
పూర్తిగా చదవండి..Aadhaar: అలర్ట్…ఆధార్ లో కీలక మార్పులు…ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకోవల్సిందే..!!
దేశంలో ఇప్పటివరకు ఆధార్ కార్డు లేనివారు చాలా మంది ఉన్నారని అంచనా. 18ఏళ్లు నిండినా ఆధార్ కార్డు పొందనివారు ఎక్కువగానే ఉన్నారు. అలాంటివారు ఇప్పుడు ఆధార్ కార్డును పొందటం అంత సులభం కాదు. కొత్తగా ఆధార్ తీసుకునే వారికి మల్టి లెవెల్ వెరిఫికేషన్ UIDAI తప్పనిసరి చేసింది.
Translate this News: