Lok Sabha Elections – BRS: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో గెలిచి కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. తాము ఇంకా బలంగానే ఉన్నామన్న సంకేతాలు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీ అవుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై కొన్నిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఒకటి రెండు స్థానాలు తప్పా.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు దాదాపు ఫైనల్ అయినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ఆధారంగా నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..BRS: పెద్దపల్లి నుంచి సుమన్, భువనగిరికి బాలరాజు యాదవ్.. ఎంపీ ఎన్నికలకు బీఆర్ఎస్ భారీ వ్యూహం.. పూర్తి లిస్ట్ ఇదే!
ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన బాల్క సుమన్, గువ్వల బాలరాజు, శ్రీనివాస్ గౌడ్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, రెడ్యానాయక్ తదితరులను బరిలోకి దించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
Translate this News: