Pension Scheme For Women: తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే మరో గ్యారెంటీ అమలుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను ఒక్కే పథకాన్ని అమల్లోకి తెస్తోంది. ఇటీవల ఆరు గ్యారెంటిల్లో రెండు గ్యారెంటీలైన మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ కాదు పరిమితి రూ.15 లక్షలకు పెంపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పని సరి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారిపై కసరత్తు చేస్తుంది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగ అర్హులు అయిన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..CM Revanth: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోజు నుంచే వారికి రూ.2,500?
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. మరో గ్యారెంటీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహిళలకు నెలకు రూ.2500 పెన్షన్ పథకంపై త్వరలోనే జీవో రానుంది.
Translate this News: