Free Bus Scheme In AP: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహళలక్ష్మి పథకం కింద మహిళలకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణానికి మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటున్నారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని.. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారని వెల్లడించారు. పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతి రోజూ 51 లక్షల మందిని సురక్షితంగా సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతోందని అన్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..CM Jagan: సంక్రాంతి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం?
ఎన్నికల ముందు సీఎం జగన్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో లాగా ఏపీలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.
Translate this News: