నిర్మల్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒకవైపు మనిషి చంద్రుని మీద కాలు మోపేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మరికొందరు తమ ఉనికిని కాపాడుకునేందుకు కుల, మతం పేరుతో గ్రామాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. తమ పెద్దరికాన్ని కాపాడుకుంటూ, వారసత్వాన్ని పునికిపుచ్చుకునేందుకు అమాయక ప్రజలపై ప్రతాపం చూపుతున్నారు. కుల సంఘాల పేరిట డబ్బులు వసూల్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ఇది అన్యాయమని ప్రశ్నించిన వారిని కుల బహిష్కరణ పేరుతో హింసించడం, ఊరినుంచి వెలేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసులు, న్యాయస్థానాలు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలకు తీసుకుంటున్నప్పటికీ అక్కడక్కడ రిపీట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి క్రూరమైన ఘటన నిర్మల్ జిల్లోలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగి నడవలేని స్థితిలో ఉన్న కల్లుగీత కార్మికుని కుటుంబం తాము అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఆ కుల పెద్దలు కుల, గ్రామ బహిష్కరణ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
పూర్తిగా చదవండి..నడవలేనిస్థితిలో ఇంటి పెద్ద.. కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన కుల పెద్దలు
నిర్మల్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. లోకేశ్వరం మండలం పిప్రీ గ్రామానికి చెందిన నరేష్ గౌడ్ కుటుంబం కుల, గ్రామ బహిష్కరణకు గురైంది. రోడ్డు ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగినందుకు గ్రామాభివృద్ధి కమిటీకి చెల్లించే డబ్బులు చెల్లించలేదని ఈ తీర్మాణం చేసినట్లు పోలీసులకు కంప్లైట్ చేశాడు.
Translate this News: