సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు పెరిగియాన్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. గతేడాది కంటే ప్రస్తుతం కేసులు పెరిగాయని తెలిపారు. వార్షిక నేర నివేదికను ఆయన విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు అవినాష్ మహంతి. గతేడాది 4,850 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 5,342 కేసులు నమోదు అయినట్లు సీపీ పేర్కొన్నారు. ఈ ఏడాది రూ. 232 కోట్ల నగదు మోసం జరిగిందన్నారు. ఈ ఏడాది 277 డ్రగ్స్ కేసుల్లో 567మందిని అరెస్టు చేసినట్లు అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ ఏడాది రెండు పీడి యాక్ట్ కేసులు నమోదు చేశామన్న సీపీ రూ. 27.82కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు చెప్పారు.
పూర్తిగా చదవండి..Cyberabad : సైబరాబాద్ పరిధిలో భారీగా పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు..!!
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు భారీగా పెరిగాయన్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. గతేడాది కంటే ప్రస్తుతం ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. వార్షిక నేర నివేదికను రిలీజ్ చేశారు.
Translate this News: