KA Paul Allegations on Laxmi Narayana: సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ కోసం జేడీ తనను రూ. 1000 కోట్లు అడిగాడని ఆరోపించారు. శుక్రవారం నాడు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్సత్తా స్థాపించిన జయప్రకాష్ నారాయణ కంటే జేడీ ఏమైనా గొప్పవాడా? అని వ్యాఖ్యానించారు. ఎవరు వెయ్యి కోట్లు ఇస్తే వారి కోసం పార్టీ పెడతారా? అని ప్రశ్నించారు. మొదట్లో జేడీ తనకు మద్దతు ఇస్తానని చెప్పారని, ఇప్పుడేమో పార్టీ పెడుతున్నారని జేడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..పార్టీ కోసం వెయ్యి కోట్లు అడిగాడు.. జేడీపై కేఏపాల్ సంచలన ఆరోపణలు..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన కొత్త పార్టీ పెడుతున్నారని, ఇందుకోసం రూ. 1000 కోట్లు అడిగారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోనే ఆయన కొత్త పార్టీ వస్తుందన్నారు పాల్.
Translate this News: