పశ్చిమగోదావరి జిల్లాలో పెళ్ళింట విషాదం సంభవించింది. పెళ్ళైన నాలుగు రోజులకే వధూవరులిద్దరూ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన వరుడు శివరామకృష్ణతో వడలికి చెందిన సత్యవతికి ఈ నెల 15న మ్యారేజైంది. వడలిలో యువతి ఇంట్లో ఉన్న ఈ కొత్త జంట..19న రాత్రి సరదాగా బైక్పై రావులపాలెంలో సినిమాకు వెళ్లారు. తిరిగొస్తుండగా ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరూ గొడవపడ్డారు. క్షణికావేశంలో ఇద్దరూ గోదావరిలోకి దూకేశారు. చుట్టుపక్కల వాళ్ళు కేకలు వేయడంతో భర్త శివరామకృష్ణను కాపాడి మత్య్సకారులు ఒడ్డుకు చేర్చారు. భార్య సత్యవతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పూర్తిగా చదవండి..Couple Suicide: గోదావరిలోకి దూకిన నవదంపతులు..భార్య మృతి, భర్త సేఫ్
పెళ్ళై నాలుగు రోజులు అయింది. సరదాగా సినిమాకు వెళ్ళారు దారిలో ఏమైందో ఏమో తెలియదు కానీ భార్యాభర్తలు ఇద్దరూ గోదావరిలోకి దూకారు. ఇందులో భార్య గల్లంతవ్వగా...భర్త మాత్రం బతికి బయటపడ్డాడు. భర్తే కావాలని భార్యను చంపాడన్న ఆరోపణలతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: