Bigg Boss Finals: బిగ్బాస్.. ఉల్టా పల్టా ఆంటూ 105 రోజుల క్రితం కింగ్ నాగార్జున షో మొదలు పెట్టిన దగ్గర నుంచి.. సంచలనగానే సాగుతూ వచ్చింది. బిగ్బాస్ అంటేనే ఎవరికీ ఏమీ అర్ధంకాని షో. ఎవరు గెలుస్తారు..ఎవరు నిలుస్తారు.. ఎపుడు ఎవరు బయటకు వచ్చేస్తారు వీటి అంచనాలు ఎప్పుడూ తారుమారు అవుతూనే ఉంటాయి. అయితే.. ఈసారి దాదాపుగా నాలుగైదు వారాల ముందుగానే, బిగ్బాస్ ఎవరు గెలుస్తారు అనేదానిపై అందరూ ఒక క్లారిటీతో అంచనాకు వచ్చేశారు. ఎప్పుడూ లేనిది కామన్ మేన్ ఈసారి గెలుపు అందుకోబోతున్నాడని ముందే అంచనా వేశారు. అంచనాలకు తగ్గట్టుగానే, బిగ్బాస్ చరిత్రలో తొలిసారిగా కామన్ మేన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రైతు కుటుంబం నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ కిరీటాన్ని ఎగరేసుకుపోయాడు. ఆదివారం రాత్రి బిగ్బాస్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Bigg Boss Finals: బిగ్బాస్ ఫైనలిస్ట్ అభిమానుల రచ్చ.. కొట్టుకున్న అభిమానులు.. పగిలిన బస్సు అద్దాలు
బిగ్బాస్ ఫైనలిస్ట్ లు అమర దీప్, ప్రశాంత్ అభిమానులు వీరంగం సృష్టించారు. పల్లవి ప్రశాంత్ గెలిచినట్లు తెలిసిన వెంటనే.. ఇద్దరి అభిమానులు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో అమర్ దీప్ కారు, ఒక సిటీబస్సు అద్దాలు బద్దలు కొట్టారు. పోలీసులు లాఠీ ఛార్జీ చేసి అభిమానులను చెదరగొట్టారు
Translate this News: