CM Revanth Reddy: నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్, ఇరిగేషన్ అధికారులతో సాగునీటి రంగంపై చర్చించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, నీటి విడుదల లభ్యతపై సమీక్షించారు. అయితే, తెలంగాణలో వర్షాభావం కారణంగా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత చాలా తక్కువగా ఉంది. ప్రధానంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరువలో ఉంది. దీంతో.. నాగార్జున సాగర్ నుంచి సాగునీరు విడుదల చేయలేమని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ తేల్చి చెప్పారు. తాగు నీటి కోసమే నీటిని విడుదల చేయగలమని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. కాగా, రెండో పంటకు సాగు నీటి విడుదలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సాగర్ ఆయకట్టు సాగు కోసం అవసరం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో సాగర్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతల వివరాలపై ఆరా తీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు వివాదం ఏంటి? వివాదం ఎందుకు చెలరేగింది? ఏపీ అధికారుల నీటి విడుదల వంటి పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం.
పూర్తిగా చదవండి..Telangana: నీటి పారుదల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..
నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో చర్చించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, నీటి విడుదల అంశంపై చర్చించారు. సాగర్ నుంచి నీరు విడుదల చేసే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.
Translate this News: