Nagababu Double Votes Issue: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న రెండు చోట్ల ఓట్ల వ్యవహారంపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. నెల్లూరులో ఆదివారం ప్రెస్మీట్ పెట్టిన నాగబాబు.. ఓట్లపై క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయ పదవులపై ఏమాత్రం ఇంట్రస్ట్ లేదన్నారు. తాను ఎంపీగా పోటీ చేస్తున్నాని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. తనకు రెండు ఓట్లు ఉన్నాయనేది ఒక కామెడీ ఇష్యూ అని కొట్టిపరేశారు. తనకు ఫిలింనగర్లో ఓటు ఉందని, తెలంగాణ ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు ఎవరూ ఓటు వినియోగించుకోలేదన్నారు నాగబాబు. తాను మంగళగిరికి వచ్చేయడంతో ఇక్కడికి ఓటు మార్పు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నామని క్లారిటీ ఇచ్చారు నాగబాబు. తానొక్కడినే కాదని, తన కుటుంబ సభ్యులు సైతం ఓటు మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు నాగబాబు. తెలంగాణలో తమకు ఉన్న ఓటును క్యాన్సిల్ చేసుకున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన, టీడీపీకి ఓటు వేస్తానని ఖరాకండిగా చెప్పారు నాగబాబు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: రెండు చోట్ల ఓట్లపై స్పందించిన నాగబాబు.. ఏమన్నారంటే..
రెండు చోట్ల ఓట్ల అంశంపై జనసేన నాయకుడు నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తాను, తన కుటుంబ సభ్యులు తెలంగాణలో ఓటు వేయలేదన్నారు. తెలంగాణలో తమ ఓటును క్యాన్సిల్ చేసుకుని.. మంగళగిరికి మార్చాలని అప్లై చేసుకున్నామన్నారు.
Translate this News: