BRS Ex MLA Kranthi Kiran : అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) ప్రసంగంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్(Kranthi Kiran) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ కరపత్రం చదివినట్లుగా ఉందన్నారు. రాష్ట్ర మొదటి పౌరురాలిగా ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి.. కాంగ్రెస్ కార్యకర్త మాదిరిగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సరికాదన్నారు. గవర్నర్ గవర్నర్ హోదాలో ఉండి.. గత ప్రభుత్వ పనితీరును బాధ్యతాయుతంగా విభేదిస్తూనే.. ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులను సూచించాల్సిందన్నారు. కానీ, అసెంబ్లీ వేదికగా ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా మాట్లాడినట్లుగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Telangana : గవర్నర్ ప్రసంగంపై మాజీ ఎమ్మెల్యే అభ్యంతరం.. కాంగ్రెస్ కరపత్రం చదివారంటూ..
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదనట్లుగా మాట్లాడటం సరికాదన్నారు.
Translate this News: