Medaram Jatara Schedule: తెలంగాణలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుంది. 21 ఫిబ్రవరి 2024 నుంచి ప్రారంభం కానున్న ఈ జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం జాతరను రాష్ట్ర జాతరగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం రూ. 75 కోట్ల నిధులను విడుదలకు ఆమోదం తెలిపింది. నిధులు కూడా విడుదల అవడంతో.. భక్తుల రద్దీని అంచనా వేస్తూ ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు అధికారులు.
పూర్తిగా చదవండి..Medaram Jatara: మేడారం జాతర ఎప్పటినుంచంటే.. వివరాలివే..
మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనుంది. ఈ మహా వన జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. మేడారం జాతర కోసం రూ. 75 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జాతరకు రెండు నెలలే సమయం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Translate this News: