Congress MLA : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) జడ్జర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై విజయం సాధించి సంచలనం సృష్టించారు అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy). అయితే.. ఇటీవల నిర్వహించిన ఓ ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంత మంది కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడికి వెళ్లి బిజినెస్ లు చేసుకుంటారని అన్నారు. అలాంటి వాళ్లు తనకు అవసరం లేదన్నారు. బిజినెస్ లు, దందాలు చేసుకునే వారు తన వద్దకు రావొద్దన్నారు. అలాంటి వారు దయచేసి తన వద్దకు రావొద్దని, ఫోన్లు కూడా చేయవద్దని ప్రెస్ మీట్లోనే కోరారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: కరీంనగర్ లో బండి సంజయ్ కు సీనియర్ల షాక్.. ఎంపీ టికెట్ ఇవ్వొద్దని డిమాండ్?
TS Congress MLA : అలాంటోళ్లు నా దగ్గరకి రావొద్దు.. వైరల్ అవుతున్న కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే వీడియో
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త ప్రభుత్వం వస్తే వారి దగ్గరకు పోయి దందాలు, బిజినెస్ చేసుకునే వారు తన వద్దకు రావొద్దని ఏకంగా ప్రెస్ మీట్లో కోరారు అనిరుధ్. అలాంటి వారు తనకు ఫోన్ కూడా చేయొద్దన్నారు.
Translate this News: