Narendra Modi Decision: పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్స్ లా చెప్పుకున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించి తిరుగులేదని నిరూపించుకుంది భారతీయ జనతా పార్టీ. ఈ మూడు రాష్ట్రాల్లోనూ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది చెప్పకుండానే ఎన్నికల సమరంలో దూకింది. ప్రధాని మోదీనే తమ ప్రధాన ప్రచార కేంద్రంగా చేసుకుని ఎన్నికల్లో ముందుకు సాగింది. అయితే, మూడు రాష్ట్రాల్లోనూ గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన నాయకులున్నారు. అంతకు మించి పార్టీని భుజాలపై మోసిన నేతలు ఉన్నారు. పైగా చాలామంది ఎంపీలను తీసుకువచ్చి ఈ రాష్ట్రాల అసెంబ్లీకి పోటీలో నిలబెట్టారు. వారిలో గెలిచిన బీజేపీ సీనియర్స్ ఉన్నారు. కానీ, ఎన్నికల ఫలితాలు వచ్చిన దాదాపు పదిరోజుల వరకూ ముఖ్యమంత్రులను ప్రకటించడానికి ఆచి, తూచి వ్యవహరించింది బీజేపీ. చివరకు మూడు రాష్ట్రాలలోనూ ఎవరూ ఊహించని.. ఎవరి లెక్కల్లోనూ లేని నేతలను ముఖ్యమంత్రులుగా ప్రకటించి షాక్ ఇచ్చింది బీజేపీ. పేరుకే బీజేపీ కానీ, ఆ వ్యవహారాలకు మూల కేంద్రం మాత్రం ప్రధాని మోదీ అనేది అందరికీ తెలిసిందే. అసలు బీజేపీ అంటేనే మోదీ.. అన్నంతగా ఆయన ప్రభావం ఉంది. ఇప్పుడు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయంలో ఈ లెక్కలు వేశారు అనేది పక్కన పెడితే.. ఇటువంటి సంచలన నిర్ణయాలు.. ప్రత్యర్ధులు కానీ.. ప్రజలు కానీ.. స్వపార్టీ వ్యక్తులు కానీ ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని మోదీ(Narendra Modi Decision) తీరే వేరు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకున్న నిర్ణయాల దగ్గర నుంచి ప్రధానిగా తీసుకుంటున్న నిర్ణయాల వరకూ అన్నీ సంచలనమే. మరీ ముఖ్యంగా ప్రధానిగా ఆయన తీసుకున్న అకస్మాత్తు నిర్ణయాలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా ప్రజలను ఆశ్చర్యంలో ముంచడంలో మోదీ తరువాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదు.
పూర్తిగా చదవండి..Narendra Modi Decision: నరేంద్ర మోదీ C/O షాకింగ్ నిర్ణయాలు..ఆయనంతే గురూ..ఊహించడం కష్టం..
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక ఇప్పుడు దేశవ్యాప్త చర్చను రేపుతోంది. అకస్మాత్తుగా ఎవరూ ఊహించని పేర్లను తెరమీదకు తీసుకువచ్చి ప్రధాని మోదీ సంచలనం రేపారు. అయితే ఇలా ఇది మొదటిసారి కాదు.. ప్రధానిగా మోదీ తీసుకున్న సంచలన నిర్ణయాలు తెలుసుకోవడానికి హెడింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: