Telangana CM Revanth Reddy: తెలంగాణలో డ్రగ్స్ ఇష్యూను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. డ్రగ్స్ విక్రయించినా.. వినియోగించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. అంతేకాదు.. గ్రే హౌండ్స్, అక్టోపస్ తరహాలో.. డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఏర్పాటు దిశగా ప్లాన్ చేస్తున్నారు. యాంటీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్గా సందీప్ శాండిల్యను నియమించాలని భావిస్తున్నారు. సందీప్ శాండిల్యకు సిన్సియర్ ఆఫీసర్గా పేరుంది. ఆ కారణంగానే.. ఆయన్ను యాంటీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్గా నియమించాలని నిర్ణయించారు. అంతేకాదు.. డ్రగ్స్ వ్యవహారంలో పాత కేసులన్నింటినీ బయటకు తీయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: టాలీవుడ్కు బిగ్ షాక్.. డ్రగ్స్ ఇష్యూపై సీఎం రేవంత్ ఫోకస్..
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పాత కేసులను బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు సీఎం. డ్రగ్స్ కంట్రోల్ టీమ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Translate this News: