స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో త్రిషతో పాటు పలువురు సినీ ప్రముఖులు మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ క్రమంలో త్రిష, ఖుష్బూ, చిరంజీవి తనను నిందించడం వల్ల తన పరువుకు భంగం కలిగిందని.. వారి నుంచి తనకు పరువునష్టం ఇప్పించాలని మద్రాసు హైకోర్టులో కేసు వేశాడు. కోటి రూపాయలు చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు.
పూర్తిగా చదవండి..Movies:మన్సూర్ అలీఖాన్ కు చివాట్లు పెట్టిన చెన్నై హైకోర్టు
తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ కు చెన్నై హైకోర్టు చివాట్లుపెట్టింది. త్రిష కదా నీ మీద కేసు పెట్టాలి..నువ్వెందుకు పెట్టావు అంటూ న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెధవ పనులు చేసి అమాయకుడిని అని చెప్పుకోవడం అలవాటు అయిపోయిందని అన్నారు.
Translate this News: