ఏపీని ఇప్పటికే మిచౌంగ్ ముంచేసి పోయింది. ఇంకా ఆ మునక నుంచి పైకి రాని ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖాధికారులు వెల్లడించారు. మిచౌంగ్ ఇప్పటికే లక్షల ఎకరాల్లో పంటను దెబ్బతీసింది. చేతికి వచ్చిన పంట నోటికి రాలేకపోయిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి తుఫాన్ ముప్పు అనేసరికి రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది.
పూర్తిగా చదవండి..ఏపీకి పొంచి ఉన్న మరో తుపాన్ ముప్పు
డిసెంబర్ 16 న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. అది 18 వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. అది శ్రీలంక, తమిళనాడు, ఏపీ వైపు కొనసాగుతోందని చెబుతున్నారు.
Translate this News: