తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukhendar Reddy) పార్టీ మారుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో (Social Media) దుష్ప్రచారం సాగుతోందని మండిపడ్డారు. తాను పార్టీ మారడం లేదని.. పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు రాజ్యాంగ బద్ధమైన శాసన మండలి ఛైర్మన్ పదవిలో ఉన్నానని.. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టబద్ధంగా తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తున్నానన్నారు. తన సంపూర్ణ సహకారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. ప్రభుత్వానికి అవసరం అయిన సలహాలు, సూచనలు అందిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: కేసీఆర్ కు రేవంత్ పరామర్శ అందుకే.. పొన్నాల లక్ష్మయ్య వివాదాస్పద వాట్సాప్ స్టేటస్!
TS Politics: పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన ప్రకటన
తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదన్నారు.
Translate this News: